మున్సిపల్ హైస్కూల్ నూతన భవనం ది.11-07-2011(సోమవారం)నాడు అధికారికంగా ప్రారంభించబడనుంది . ప్రస్తుత హెడ్ మిసెస్ జ్యోతి మేడమ్ పూర్వవిద్యార్ధులందరినీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. స్ధానికంగా ఉన్న మన మిత్రుడు నరసింహారావుకు మౌఖికంగా తెలియజేశారు. నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ పూర్వవిద్యార్ధులందరికీ ప్రారంభోత్సవానికి హాజరుకావల్సిందని మనల్ని తెలియజేయమన్నారు. కనుక మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్ధులందరికీ నూతన భవన ప్రారంభోత్సవానికి ఈ వేదిక ఆహ్వానం పలుకుతోంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి