5, జులై 2015, ఆదివారం

24, మార్చి 2015, మంగళవారం

                           NRT84-85 బ్యాచ్  పూర్వవిద్యార్ధులచే గర్ల్స్ హైస్కూల్ కు బీరువా బహుకరణ
నర్సరావుపేట మున్సిపల్ హైస్కూల్ 1984-85'  పదవతరగతి పూర్వవిద్యార్ధుల మూడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా   ఈరోజు (24-03-2015) మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్ లోని కంప్యూటర్స్ విభాగానికి బీరువా బహుకరించబడింది. గర్ల్స్ హైస్కూల్ కంప్యూటర్స్ విభాగంలోని కాంచన టీచర్  మరియు సత్యనారాయణ మాస్టారు గార్ల  అభ్యర్ధన మేరకు , కంప్యూటర్ సెక్షన్ రికార్డులు మరియు మానిటర్ల భద్రతకు అవసరమైన బీరువా 84-85 పదవతరగతి బ్యాచ్  తరపున ఈ బహుకరణ చేయడమైనది. ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్ధులు శ్రీ.నాగసరపు.నర్సింహారావు, గొడవర్తి.తిరుమలేష్, జుజ్జూరి.రామకృష్ణ, అర్వపల్లి.శ్రీను,  మిట్టపల్లి.భాస్కర్,  సి.హెచ్.బదరీ తదితరులు పాల్గొన్నారు. 
         మరో విశేషమేమిటంటే,    ఈ " నరసరావుపేట పూర్వవిద్యార్ధుల వేదిక "  బ్లాగ్ సృష్టికర్తలైన  NRT84-85' 10వతరగతి పూర్వవిద్యార్ధులకు హైస్కూల్ చదువు ముగిసి,   ఈ సంవత్సరానికి  మూడు దశాబ్దాలు గడుస్తున్నది.  బ్యాచ్ త్రిదశాబ్ది సందర్భాన్ని ఎలా జరుపుకోవాలన్న అంశంపై  బ్యాచ్ పూర్వవిద్యార్ధులు తమ అభిప్రాయాలను వెల్లడించాలని  ఈ వేదిక కోరుతున్నది.


3, జులై 2014, గురువారం

05-07-2014 తేదిన నేస్తం ట్రస్ట్ function

05-07-2014 తేదిన నేస్తం ట్రస్ట్ ఆధ్వర్యం లో  నరసరావుపేట మునిసిపల్ హైస్కూల్ నందు జరుగు కార్యక్రమాల వివరాలతొ కర పత్రం  చూడండి.

6, ఫిబ్రవరి 2014, గురువారం

నర్సరావుపేటలో "నేస్తం" ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్ధిని చదువుకు సాయం

నర్సరావుపేట మున్సిపల్ హైస్కూల్ 1985-86 పదవతరగతి పూర్వవిద్యార్ధులు ఏర్పాటుచేసిన "నేస్తం" ట్రస్ట్ ఆధ్వర్యంలో  స్ధానిక ఈ.వి.ఎం.ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ రెండవ సంవత్సరం  చదువుతున్న విద్యార్ధిని ఆవుల. లావణ్య ట్యూషన్ ఫీజు నిమిత్తం వరుసగా రెండో సంవత్సరం  రూ.10,000/- కు ఆర్ధిక సాయం చేయడం జరిగింది. ఈ మేరకు స్ధానికి ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.డిపో డిప్యూటి చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీమతి.సుధాబిందు గారి చేతులమీదుగా చెక్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్ధి మరియు నేస్తం ట్రస్ట్ ప్రతినిధి కొత్తా.రామ్మోహన్ పాల్గొన్నారు.

                                      లావణ్యకు చెక్ అందజేస్తున్న శ్రీమతి సుధాబిందు, రామ్మోహన్

23, జనవరి 2014, గురువారం

నర్సరావుపేట మున్సిపల్ హైస్కూల్లో ఈ-లెర్నింగ్ కేంద్రం ప్రారంభం

మున్సిపల్ హైస్కూల్ 1985-86 10వతరగతి పూర్వవిద్యార్ధులచే ఏర్పాటు కాబడ్డ "నేస్తం" ట్రస్ట్ ఆధ్వర్యంలో 22-01-2014(బుధవారం) నాడు  హైస్కూల్లో e-learning  సెంటర్ ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ కం టాక్స్ కమీషనర్ శ్రీ.జాస్టి.కృష్ణకిషోర్ ఈ-లెర్నింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రంధాలయాన్ని నర్సరావుపేట ఆర్డిఓ శ్రీ.ఎం.శ్రీనివాసరావు ప్రారంభించారు.  ఈ సందర్భంగా జరిగిన సభకు నేస్తం ట్రస్ట్ ప్రతినిధి మరియు పూర్వవిద్యార్ధి శ్రీ.కొత్తా.రామ్మోహన్ (అడ్వకేట్) అద్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో నేస్తం ట్రస్ట్ ప్రతినిధులు శ్రీ.పి.జితేంద్ర చక్రవర్తి, లంకా.శ్రీనివాసశర్మ, సోము.వెంకటరమణ ,  మున్సిపల్ కమిషనర్ శ్రీ.ఎ.వి.వీరభద్రరావు  మరియు  హెడ్ మాస్టర్ శ్రీ.రవికాంత్ గారు పాల్గొన్నారు.
ప్రెస్ కవరింగ్స్ క్రింద చూడగలరు.




20, జనవరి 2014, సోమవారం

1985-86 batch10వ తరగతి విద్యార్ధులచే మునిసిపల్ హైస్కూల్ లొ e learning centre

22-01-2014 న నరసరావుపేట మునిసిపల్ హైస్కూల్ లొ 1985-86 batch 10వ తరగతి విద్యార్ధులచే e learning centre మధ్యాన్నం 3:00 గం.లకు ప్రారంభిస్తున్నారు. అందరూ ఆహ్వానితులే

30, డిసెంబర్ 2013, సోమవారం

మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్ధులకు "పరీక్షలపై అవగాహన" సెమినార్

మిత్రులారా,

నర్సరావుపేట మున్సిపల్ బాయ్స్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్ధులకు "Do's n Dont's for X class exams" అన్న అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ NRT85 10వతరగతి పూర్వవిద్యార్ధుల వేదిక ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ది.28-12-2013(శనివారం) ఉదయ 10గం.లకు హైస్కూల్లో కంప్యూటర్స్ క్లాస్ రూమ్ లో హెడ్ మాస్టర్ శ్రీ.రవికాంత్ గారి అద్యక్షతన ఈ పవర్ పాయింట్ సెమినార్ జరిగింది.  దాదాపు గంటన్నర సేపు జరిగిన ఈ ప్రెజెంటేషన్ లో పరీక్షల సమయంలో ఎదురయ్యే యాంగ్జైటి, భయం లాంటి అంశాల గురించి శాస్త్రీయంగా వివరించడం జరిగింది. ఏకాగ్రత సాధనకు అవసరమైన టెక్నిక్స్ , ప్రాక్టీస్ గైడ్ లైన్స్ వివరించడం జరిగింది. జ్ఞాపకశక్తి పెంపుదలకై పాటించదగ్గ టెక్నిక్స్ వివరించడం జరిగింది. పరీక్షలను  సులువుగా ఎదుర్కోడానికి అనుసరించాల్సిన ప్రణాళిక, టైం మెనేజ్ మెంట్ టెక్నిక్స్ కూడా వివరించడం జరిగింది. పరీక్షల రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరీక్ష హాల్లో పాటించాల్సిన అంశాలు వంటివి కూడా ఈ ప్రెజంటేషన్లో వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ శ్రీ.రవికాంత్ గారు, టీచర్లు శ్రీ.టి.మధుసూధనమూర్తిగారు, శ్రీ.ఒ.సాంబయ్య గారు పాల్గొన్నారు. పూర్వవిద్యార్ధులవేదిక నుండి డా.కె.శివబాబు, నాగసరపు.నర్సింహారావు,జుజ్జూరి.రామకృష్ణ,శాఖమూరి.రాంబాబు పాల్గొన్నారు. 
ఫోటోలు , ప్రెస్ క్లిప్పింగ్స్ క్రింద ఇవ్వబడ్డాయి.
                        
               
                
                 



25, నవంబర్ 2013, సోమవారం

nrt85 పదవతరగతి పూర్వవిద్యార్ధుల ఆధ్వర్యంలో "విజయవంతంగా జరిగిన ఉచిత డయాబెటిస్ మెగాక్యాంప్"-650మందికి పైగా హాజరైన ప్రజలు


నవంబర్ 24 (ఆదివారం) ఉదయం 6గం.ల నుండి మధ్యాహ్నం 3గం.ల వరకు నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్లో జరిగిన ఉచిత డయాబెటిస్ మెగాక్యాంప్ విజయవంతమైంది. ఉదయం 6గం.ల నుండే  వచ్చిన ప్రజలకు గ్లూకోమీటర్ సహాయంతో రక్తంలో షుగర్ పరీక్షలు చేయడం జరిగింది. దాదాపు 8మంది ల్యాబ్ టెక్నిషియన్లు, 4గురు నర్సులు, ఇద్దరు డాక్టర్లు, 20మందికి పైగా nrt85 పూర్వవిద్యార్ధుల వేదిక సభ్యులు , స్వచ్చందంగా వచ్చి సేవలందించిన కొద్దిమంది సీనియర్ సిటిజన్స్/పెన్షనర్స్ సంఘం సభ్యులు .. ఇలాంటి ఎంతోమంది సమిష్టి కృషితో 650మందికి పైగా నరసరావుపేట ప్రాంత ప్రజలకు ఆదివారం నాడు ఉచితంగా రక్తంలో షుగర్ పరీక్షలు పరగడపున మరియు భోజనానంతరం నిర్వహించడం జరిగింది. షుగర్ వ్యాధి వున్నవారందరికీ ఉచితంగా మందులు కూడా పంపిణీచేయడం జరిగింది. షుగర్ వ్యాధిలో పాటించాల్సిన ఆహార నియమాలు, వ్యాయామం , కాంప్లికేషన్స్ నివారణ వంటి పలు అంశాలగురించి  అవగాహన కలిగేలా వివరాలతో ప్రచురించిన బుక్ లెట్స్ హాజరైన వారందరికీ పంపిణి చేయడం జరిగింది. షుగర్ వ్యాధి గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నిర్వహించిన అవగాహన సదస్సులో  200మందికి పైగా శ్రోతలు పాల్గొని , ఆద్యంతం ఆసక్తిగా విని, తమ సందేహాలను కూడా అడిగి నివృత్తి చేసుకున్నారు. అవసరమైనవారికి పాదాల్లో న్యూరోపతి ని గుర్తించే బయోధీసియోమెట్రీ పరీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో డా.కె.శివబాబు, డా.ఎ.విజయలక్ష్మి   పేషెంట్లను పరీక్షించి, వైద్యచికిత్స అందించారు. శిబిరం నిర్వహణలో పూర్వవిద్యార్ధులు నాగసరపు.నర్సింహారావు, అరవపల్లి.శ్రీనివాసరావు, మేకల.నాగేశ్వరరావు,జుజ్జూరి.రామకృష్ణ,నూతక్కి.శ్రీనివాసరావు,గొడవర్తి,తిరుమలేశ్వరరావు,కూనిశెట్టి.సత్యసాయి, కొప్పురావూరి.అశోక్ కుమార్, మిట్టపల్లి.భాస్కర్, రెడ్డిచంద్ర,రామలింగేశ్వరరావు,జి.వి.ఎస్.ప్రసాద్,చీమకుర్తి.బదరినాధ్,గుండా.శ్రీనివాసరావు,టి.రమేష్, దేసు.శ్రీనివాసరావు,రసూల్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ బాలుర హైస్కూల్ ప్రస్తుత హెడ్ మాస్టర్ శ్రీ.రవికాంత్ గారు, ఇతర టీచర్లు కూడా శిబిరం నిర్వహణలో ఉత్సాహంగా పాల్గొని తమవంతు సహకారాన్ని అందించారు. గతంలో రెండునెలలపాటు జరిగిన సమైక్యాంధ్ర సమ్మెల ఫలితంగా ప్రస్తుతం ఆదివారం కూడా హైస్కూల్లో తరగతులు నిర్వహించబడుతున్నప్పటికీ, హెడ్ మాస్టర్ మరియు టీచర్లు , క్లాస్ రూమ్ లు సర్దుబాటు చేసి వైద్యశిబిరం నిర్వహణకు ఇబ్బంది లేకుండా సహకరించారు. 
 అంతకుముందు రోజు 23-11-2013 (శనివారం) ఉదయం నరసరావుపేట పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యుల అభ్యర్ధన మేరకు nrt 85 పూర్వవిద్యార్ధుల వేదిక ఆధ్వర్యంలో పెన్షనర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో  దాదాపు 75మందికి ఉచిత డయాబెటిస్ క్యాంప్ నిర్వహించి రక్తపరీక్షలు చేసి, ఉచిత మందులు ఇవ్వడం జరిగింది.  
పూర్తి విశేషాలతో కూడిన  ఫోటోలు మరియు ప్రెస్ క్లిప్పింగ్స్ క్రింద చూడగలరు.

"మధుమేహవ్యాధి అవగాహన" పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ 

హైస్కూల్ ప్రవేశద్వారం ఉదయం 6.30 గం.లకు











పరీక్షిస్తున్న వైద్యులు డా.కె.శివబాబు, డా.ఎ.విజయలక్ష్మి





మందులు పంపిణి జరిగిన రూమ్









     
 
హెడ్ మాస్టర్ శ్రీ.రవికాంత్ గారిని సన్మానిస్తున్న nrt85 పూర్వవిద్యార్ధులు





10, నవంబర్ 2013, ఆదివారం

నవంబర్ 24న NRT85 పూర్వవిద్యార్ధుల వేదిక ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిస్ మెగాక్యాంప్

మిత్రులారా,
ఈ వేదిక గత సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 4వ ఆదివారం , తేది :24-11-2013 నాడు  నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో నరసరావుపేట 1985 పూర్వవిద్యార్ధుల వేదిక ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిస్ మెగా క్యాంప్ జరుగనున్నది. ఈ క్యాంప్ లో ఉదయం 6గం. నుండి 9గం. వరకు పరగడపున వచ్చిన వారికి రక్తంలో షుగర్  పరీక్ష నిర్వహిస్తారు. డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలైన అరికాళ్లలో తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం వంటి లక్షణాలున్న వారిలో న్యూరోపతి తీవ్రత తెలుసుకునే బయోధీసియోమెట్రీ పరీక్ష ఉచితంగా చేసి రిపోర్టు ఇవ్వబడుతుంది.  అనంతరం డయాబెటాలజిస్ట్ తో కన్సల్టేషన్ ఉంటుంది. వ్యాధి నిర్ధారణ అయినవారికి వారంరోజులకు సరిపడా మందులు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి మరియు మధుమేహం గురించి సులభరీతిలో వివరించే ఒక బుక్ లెట్  క్యాంప్ కు హాజరైన ప్రతి ఒక్కరికీ అందజేస్తారు. ఉదయం 11గం.కు డయాబెటిస్ - వ్యాధిఅవగాహన సదస్సులో మధుమేహాన్ని గురించి వివరించే పవర్ పాయింట్ వీడియో ప్రదర్శించబడుతుంది. అనంతరం డయాబెటిస్ వ్యాధి గురించిన ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది.  ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అవసరమైన గ్రౌండ్ వర్క్ నరసరావుపేటలో ఇప్పటికే జరుగుతున్నది.  పూర్వవిద్యార్ధులు, శ్రేయోభిలాషులు తమవంతు సహాయసహకారాలందించి  క్యాంప్ జయప్రదం చేయవల్సిందిగా విజ్ఞప్తి. వివరాలకు నాగసరపు.నర్సింహారావు(9246453353),అర్వపల్లి.శ్రీనివాసరావు(9948694500),మేకల.నాగేశ్వరరావు(9491671867)
జజ్జూరి.రామకృష్ణ(9441010264),జి.వి.ఎస్.ప్రసాద్(9440240822),గొడవర్తి.తిరుమలేష్(9440434223), కొప్పురావూరి.అశోక్ (9866325267),డా.పుచ్చ.ఆనంద్(9849071750)తదితరులను సంప్రదించగలరు.