12, సెప్టెంబర్ 2011, సోమవారం

ఉత్సాహంగా జరిగిన మున్సిపల్ హైస్కూల్ 1982-83 పదవతరగతి విద్యార్ధుల పునసమ్మేళనం

నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ పదవతరగతి 1982-83 బ్యాచ్ పూర్వవిద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది. 11-09-2011(ఆదివారం) ఉదయం 8గం.లనుండి సాయంత్రం 7గం.ల వరకు జరిగిన ఈ సమ్మేళనంలో దాదాపు 150మంది పూర్వవిద్యార్ధులు వారి కుటుంబసభ్యులతో సహా హాజరయ్యారు. నాటి ఉపాధ్యాయులను సన్మానించుకుని, మరపురాని జ్ఞాపకాలను నెమరువేసుకుని పరవశులయ్యారు.

క్రింది సాక్షి పేపర్ క్లిప్పింగ్ లో మరిన్ని వివరాలు చూడండి






4, సెప్టెంబర్ 2011, ఆదివారం

మున్సిపల్ హైస్కూల్ 1982 -' 83 బ్యాచ్ పదవ తరగతి పూర్వవిద్యార్ధుల పునసమ్మేళనం

మిత్రులారా,

నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ 10వతరగతి పూర్యవిద్యార్ధుల పునసమ్మేళనాలు ఉత్సాహకరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని బ్యాచ్ ల పూర్వవిద్యార్ధుల కలయికలు జరిగాయి.  ఇప్పుడు తాజాగా 1982-'83 బ్యాచ్ విద్యార్ధుల సమ్మేళనం జరుగనుంది. ది.11-09-2011(ఆదివారం) నాడు జరుగనున్న  ఈ సమ్మేళనంలో దాదాపు 300మంది పాల్గొననున్నారని అంచనా.ఈ మీట్   స్ధానిక ప్రకాష్ నగర్ లోని యర్రంశెట్టి ఫంక్షన్ ఫ్లాజా లో జరుగనుంది.
నాటి  ఉపాధ్యాయులందరూ ఆహ్వానితులుగా పాల్గొననున్న ఈ కలయిక ఆదివారం అనగా 11వతేది ఉదయం 8గం.ల నుండి సాయంత్రం 5గం.ల వరకు జరుగనుంది. ఈ సమావేశాన్ని నాటి పూర్వవిద్యార్ధులు శ్రీ.బి.కామేశ్వరశాస్త్రి, కొత్త.రామకృష్ణ(సింధు స్కూల్), కొత్త.సీతారామాంజనేయులు, పెనుగొండ.ప్రభాకర్, కపలవాయి.శివప్రసాద్, కటకాల.మారూతిప్రసాద్, కప్పగంతుల.మోహన్ కుమార్, మునగా.వేణుమాధవ్, కూరపాటి.గుప్త ల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది.