6, ఫిబ్రవరి 2014, గురువారం

నర్సరావుపేటలో "నేస్తం" ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్ధిని చదువుకు సాయం

నర్సరావుపేట మున్సిపల్ హైస్కూల్ 1985-86 పదవతరగతి పూర్వవిద్యార్ధులు ఏర్పాటుచేసిన "నేస్తం" ట్రస్ట్ ఆధ్వర్యంలో  స్ధానిక ఈ.వి.ఎం.ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ రెండవ సంవత్సరం  చదువుతున్న విద్యార్ధిని ఆవుల. లావణ్య ట్యూషన్ ఫీజు నిమిత్తం వరుసగా రెండో సంవత్సరం  రూ.10,000/- కు ఆర్ధిక సాయం చేయడం జరిగింది. ఈ మేరకు స్ధానికి ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.డిపో డిప్యూటి చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీమతి.సుధాబిందు గారి చేతులమీదుగా చెక్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్ధి మరియు నేస్తం ట్రస్ట్ ప్రతినిధి కొత్తా.రామ్మోహన్ పాల్గొన్నారు.

                                      లావణ్యకు చెక్ అందజేస్తున్న శ్రీమతి సుధాబిందు, రామ్మోహన్