11, జులై 2011, సోమవారం

మున్సిపల్ హైస్కూల్ నూతన భవనం అధికారిక ప్రారంభం

నర్సరావుపేట మున్సిపల్ హైస్కూల్ నూతన భవనం   నేడు ప్రారంభించబడింది. స్ధానిక ఎం.ఎల్.ఏ మరియు మంత్రివర్యులు శ్రీ కాసు.కృష్ణారెడ్డి గారు ముఖ్యఅతిధిగా విచ్చేసిన  ఈ కార్యక్రమం ప్రస్తుత ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి.పి.జ్యోతి మేడమ్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ .శరత్, ఆర్.డి.ఓ.అరుణ్ బాబు, మున్సిపల్ కమిషనర్ వీరభద్రరావు, మాజీ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు   శ్రీ.నాగేశ్వరరావు, ప్రసాదరావు, వసుంధరాదేవి, బాలు, అప్పారావు, ఈ వేదిక సభ్యులైన నాగసరపు.నర్సింహారావు, మేకల.నాగేశ్వరరావు, జుజ్జూరి.రామకృష్ణ, అరవపల్లి.శ్రీనివాసరావు తదితర  పూర్వవిద్యార్ధులు  , ఇతర పురప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరైనారు.
                         
                                  


1, జులై 2011, శుక్రవారం

నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ నూతన భవన ప్రారంభోత్సవ ఆహ్వానం

మిత్రులారా,
మున్సిపల్ హైస్కూల్ నూతన భవనం ది.11-07-2011(సోమవారం)నాడు అధికారికంగా ప్రారంభించబడనుంది .  ప్రస్తుత హెడ్ మిసెస్ జ్యోతి మేడమ్ పూర్వవిద్యార్ధులందరినీ ప్రారంభోత్సవానికి   ఆహ్వానించారు. స్ధానికంగా ఉన్న మన మిత్రుడు నరసింహారావుకు మౌఖికంగా తెలియజేశారు. నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ పూర్వవిద్యార్ధులందరికీ ప్రారంభోత్సవానికి హాజరుకావల్సిందని మనల్ని తెలియజేయమన్నారు.  కనుక మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్ధులందరికీ  నూతన భవన ప్రారంభోత్సవానికి ఈ వేదిక ఆహ్వానం పలుకుతోంది.