3, జులై 2014, గురువారం
6, ఫిబ్రవరి 2014, గురువారం
నర్సరావుపేటలో "నేస్తం" ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్ధిని చదువుకు సాయం
నర్సరావుపేట మున్సిపల్ హైస్కూల్ 1985-86 పదవతరగతి పూర్వవిద్యార్ధులు ఏర్పాటుచేసిన "నేస్తం" ట్రస్ట్ ఆధ్వర్యంలో స్ధానిక ఈ.వి.ఎం.ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని ఆవుల. లావణ్య ట్యూషన్ ఫీజు నిమిత్తం వరుసగా రెండో సంవత్సరం రూ.10,000/- కు ఆర్ధిక సాయం చేయడం జరిగింది. ఈ మేరకు స్ధానికి ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.డిపో డిప్యూటి చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీమతి.సుధాబిందు గారి చేతులమీదుగా చెక్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్ధి మరియు నేస్తం ట్రస్ట్ ప్రతినిధి కొత్తా.రామ్మోహన్ పాల్గొన్నారు.
23, జనవరి 2014, గురువారం
నర్సరావుపేట మున్సిపల్ హైస్కూల్లో ఈ-లెర్నింగ్ కేంద్రం ప్రారంభం
మున్సిపల్ హైస్కూల్ 1985-86 10వతరగతి పూర్వవిద్యార్ధులచే ఏర్పాటు కాబడ్డ "నేస్తం" ట్రస్ట్ ఆధ్వర్యంలో 22-01-2014(బుధవారం) నాడు హైస్కూల్లో e-learning సెంటర్ ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ కం టాక్స్ కమీషనర్ శ్రీ.జాస్టి.కృష్ణకిషోర్ ఈ-లెర్నింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రంధాలయాన్ని నర్సరావుపేట ఆర్డిఓ శ్రీ.ఎం.శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు నేస్తం ట్రస్ట్ ప్రతినిధి మరియు పూర్వవిద్యార్ధి శ్రీ.కొత్తా.రామ్మోహన్ (అడ్వకేట్) అద్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో నేస్తం ట్రస్ట్ ప్రతినిధులు శ్రీ.పి.జితేంద్ర చక్రవర్తి, లంకా.శ్రీనివాసశర్మ, సోము.వెంకటరమణ , మున్సిపల్ కమిషనర్ శ్రీ.ఎ.వి.వీరభద్రరావు మరియు హెడ్ మాస్టర్ శ్రీ.రవికాంత్ గారు పాల్గొన్నారు.
ప్రెస్ కవరింగ్స్ క్రింద చూడగలరు.
20, జనవరి 2014, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)