నర్సరావుపేట మున్సిపల్ హైస్కూల్ 1984-85' పదవతరగతి పూర్వవిద్యార్ధుల మూడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు (24-03-2015) మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్ లోని కంప్యూటర్స్ విభాగానికి బీరువా బహుకరించబడింది. గర్ల్స్ హైస్కూల్ కంప్యూటర్స్ విభాగంలోని కాంచన టీచర్ మరియు సత్యనారాయణ మాస్టారు గార్ల అభ్యర్ధన మేరకు , కంప్యూటర్ సెక్షన్ రికార్డులు మరియు మానిటర్ల భద్రతకు అవసరమైన బీరువా 84-85 పదవతరగతి బ్యాచ్ తరపున ఈ బహుకరణ చేయడమైనది. ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్ధులు శ్రీ.నాగసరపు.నర్సింహారావు, గొడవర్తి.తిరుమలేష్, జుజ్జూరి.రామకృష్ణ, అర్వపల్లి.శ్రీను, మిట్టపల్లి.భాస్కర్, సి.హెచ్.బదరీ తదితరులు పాల్గొన్నారు.
మరో విశేషమేమిటంటే, ఈ " నరసరావుపేట పూర్వవిద్యార్ధుల వేదిక " బ్లాగ్ సృష్టికర్తలైన NRT84-85' 10వతరగతి పూర్వవిద్యార్ధులకు హైస్కూల్ చదువు ముగిసి, ఈ సంవత్సరానికి మూడు దశాబ్దాలు గడుస్తున్నది. బ్యాచ్ త్రిదశాబ్ది సందర్భాన్ని ఎలా జరుపుకోవాలన్న అంశంపై బ్యాచ్ పూర్వవిద్యార్ధులు తమ అభిప్రాయాలను వెల్లడించాలని ఈ వేదిక కోరుతున్నది.
1 కామెంట్:
Happy to learn about this good work. If known earlier, I would have also contributed.
Can you create a facebook page? It's easier to see posts on facebook.
regards,
Veeranjaneyulu
కామెంట్ను పోస్ట్ చేయండి