30, మే 2011, సోమవారం

అనుభూతుల పందిరిలో జ్ఞాపకాల సంగమంగా 83-84 పదవ తరగతి విద్యార్ధుల సమ్మేళనం

నరసరావుపేట మున్సిపల్ బాయ్స్  హైస్కూల్ లో 1983-84 బ్యాచ్ పదవతరగతి చదివిన విద్యార్ధుల పునసమ్మేళనం ది.29-05-2011 (ఆదివారం) నాడు స్ధానిక జమీందార్ ఫంక్షన్ ప్లాజాలో ఆనందోత్సాహల మధ్య ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వివిధ ఉద్యోగ, వ్యాపారాల్లో స్ధిరపడ్డ  సుమారు 220మంది పూర్వవిద్యార్ధులు కుటుంబాలతో సహా 28ఏళ్ల తర్వాత కలిసుకుని ఎంతో భావోద్వేగంతో పాత మధుర జ్ఞావకాలను నెమరువేసుకున్నారు. నాటి ముచ్చట్లతో, చిన్ననాటి సంఘటనల్ని గుర్తుతెచ్చుకుంటూ  అవధుల్లేని ఆనందోద్వేగాలలో తేలియాడారు. నాడు తమకు చదువులు గరిపిన గురువులను సన్మానించుకుని గురువులపట్ల తమ కృతజ్ఞతా గౌరవాల్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నాటి విద్యార్ధులు పి.రాజశేఖర్, వై.శివాజీ,ఆదినారాయణ,అమర్ నాధ్, సత్యనారాయణ తదితరులు పర్యవేక్షించారు. ఈ సమ్మేళనంలో   పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు నిర్వహించారు.


సమ్మేళనానికి ఆతిధ్యమిచ్చిన జమీందార్ ఫంక్షన్ ప్లాజా

వేదికనలంకరించిన ఉపాధ్యాయులు


ప్రారంభోపన్యాసం చేస్తున్న నాటి విద్యార్ధి పి.రాజశేఖర్




కామెంట్‌లు లేవు: