నర్సరావుపేట మున్సిపల్ హైస్కూల్ లో గురజాడ కళామందిరానికి ముందరి ఆవరణలో ప్రహరీ గోడ నిర్మించ తలపెట్టిన విషయం మీకందరికీ ఎరుకే. కొన్ని రోజుల క్రితం ఈ సంఘటన జరిగినప్పుడు చారిత్రాత్మక మైదానాన్ని విడదీయవద్దని ఈ వేదిక తరపున ప్రజాసంఘాలను కలుపుకుని కమీషనర్ కు విజ్ఞప్తి చేయడం, పత్రికాముఖంగా నిరసన తెలపడం జరిగింది. ఫలితంగా ఆ పని నిలిపివేయడం జరిగింది. తాజాగా , మైదానంలో తవ్విన గుంతల్ని పూడ్చి మరలా పాతవైభవాన్ని తీసుకురావడం జరిగింది. ఈ విషయం మనందరికీ సంతోషదాయకం. అంతే కాకుండా 27-02-2013(గురువారం) నాడు పునరుద్దరించబడ్డ ఈ చారిత్రాత్మక మైదానంలో జరిగిన ధార్మిక కార్యక్రమంలో వేలాదిమంది పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీ భారతి తీర్ధస్వామి పాల్గొన్నారు. క్రింది ఫోటోల్లో విశేషాలు చూడగలరు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి