9, మార్చి 2011, బుధవారం

మున్సిపల్ హైస్కూల్ మాజీ ప్రధానోపాధ్యాయులు శ్రీ.గడ్డం.వెంకటేశ్వరరావు మాస్టారికి నివాళులు

నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్  ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి రిటైరైన  శ్రీ గడ్డం.వెంకటేశ్వరరావు మాస్టారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్ది సంవత్సరాలుగా తన దత్తత కుమారుడైన గడ్డం.హరిబాబు(పేటలో ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు) గారి దగ్గరే ఇంట్లోనే వైద్యపరివేక్షణలో  ఉంటున్నారు. గత సంవత్సరం డిసెంబర్లో మేము nrt85 సిల్వర్ జూబ్లి మీట్ కు  ఆహ్వానించేందుకు వెళ్లినప్పుడు కూడా ఆయన్ను కలిసి మాట్లాడేందుకు ఆయన అనారోగ్య కారణాలవల్ల  సాధ్యం కాలేదు. ఇంతలోనే నిన్న ఉదయం (09-03-2011) ఆయన మరణించినట్లు వార్త తెలిసింది. గడ్డం.వెంకటేశ్వరరావు మాస్టారు నరసరావుపేట స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. పట్టణంలో అందరికీ సుపరిచితులైన ,  మున్సిపల్ హైస్కూల్ లో మా పూర్వఉపాధ్యాయులు మరియు  హెడ్ మాస్టర్ గా రిటైరైన  శ్రీ గడ్డం.వెంకటేశ్వరరావు మాస్టారికి నరసరావుపేట వూర్వ విద్యార్ధుల వేదిక నివాళులర్పిస్తోంది.

1 కామెంట్‌:

ramana చెప్పారు...

very sad news to hear....when i was in 5th form or 6th form, he joined the school.smiling always, mastru used to wear white shirt and white dhoti. he loved all his students.though one is not his direct student, he used to enquire his name class, his studies etc. for a long time he stayed in his own house at prakashnagr.recently when i went to narasaraopet,when iwas passing through prakashnagar, i identified his house